telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనాపై పోరుకు రామోజీరావు రూ. 20 కోట్ల విరాళం!

Ramoji Rao Eanadu Groups

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ లకు రూ. 10 కోట్ల చొప్పున, మొత్తం రూ. 20 కోట్లను ఆయన ప్రకటించారు. స్వయంగా ఆయనే కేసీఆర్, వైఎస్ జగన్ లను కలిసి ఈ విరాళాన్ని ఇవ్వాలని భావించారు.

కానీ ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా రిలీఫ్ ఫండ్ ఖాతాల్లో వేస్తున్నారని ఈనాడు గ్రూప్ వర్గాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రామోజీరావు మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ కరోనాపై చేస్తున్న పోరాటంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమవంతు సాయాన్ని అందిస్తున్న విషయం విధితమే.

Related posts