వైసీపీ ప్రచారంలో జోరు పెరుగుతుంది. ప్రచారంలో భాగంగా సినీ నటులు అలీ, పోసాని కృష్ణ మురళీ నాయకత్వంలో రెండు టీమ్లు పని చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు.
రేపు(సోమవారం) బొబ్బిలి నుంచి ప్రచారం ప్రారంభిస్తామన్నారు.పేద ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాలంటే రాజన్న రాజ్యం రావాలని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలని.. ఇందుకు ప్రతీ వైసీపీ కార్యకర్త, నేతలు కృషి చేయాలని పృథ్వీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.