ఇప్పటివరకు తుమ్మితే ఊడిపోయేట్టుగా ఉన్న కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సంక్షోభంలో పడింది. బీజేపీనే ఇదంతా చేయిస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు.
దీనిపై యడ్యూరప్ప స్పందిస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను తుమకూరుకు వెళ్తున్నానని, సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తానని అన్నారు. ‘మారుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీకు తెలుసు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కుమారస్వామి, సిద్ధరామయ్యల వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడదలుచుకోలేదు. జరుగుతున్న దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పారు.