telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

విజయవాడ మర్డర్ కేసులో ట్విస్ట్.. ఎవరి గొంతులు వాళ్లే కోసుకున్నారు

బెజ‌వాడ‌ యువ‌తి హత్యకేసు మరో మలుపు తిరిగింది. తాను దివ్య గొంతు కోయలేదని..ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నట్లు నాగేంద్ర పేర్కొన్నాడు. దివ్య గొంతు తానే కోసుకున్నాడని కూడా తెలిపాడు నాగేంద్ర. ఎవరి గొంతు వాళ్ళు కోసుకున్నామని..తాను స్పృహ తప్పి పడిపోయానని..ఆ తర్వాత తన చేతిని ఎవరు కోసారో అర్థం కావడం లేదన్నాడు నాగేంద్ర. లాక్డౌన్ సమయంలో తామిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకున్నామని…ఆ తర్వాత దివ్య తల్లిదండ్రులు తమను విడదీశారని ఆవేదన వ్యక్తం చేసాడు.

కాగా..దాడి జరిగిన వెంటనే బాధితురాలిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు స్థానికులు.. అయితే, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతో బాధితురాలు నిన్న మృతిచెందింది. నాగేంద్ర కూడా త‌న‌ను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ప్ర‌స్తుతం నాగేంద్ర ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే..ఈ ఘటనపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నయి. అసలు ఆ యువతికి, నాగేంద్ర మధ్య ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉందని తెలుస్తోంది. అన్ని కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Related posts