telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

Breaking : మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

Sabbam Hari Tdp

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అటు ఈ కరోనా కారణంగా చాలా మంది రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు మృతి చెందారు. అయితే తాజాగా.. మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బంహరి కరోనా కాటుకు బలి అయ్యారు. ఇటీవల కరోనా బారిన పడిన సబ్బంహరి.. పరిస్థితి విషమించడంతో.. ఆరిలోవ అపోలోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనాతో గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్న సబ్బం హరి.. ఇవాళ 12 గంటల సమయంలో మృతి చెందినట్లు సమాచారం. సబ్బంహరి మృతి ఆయన కుటుంబం విషాదంలోకి వెళ్ళింది. అటు ఆయన మృతి వార్త తెలిసిన టిడిపి నేతలు ఆయనకు సంతాపం తెలిపారు.

Related posts