కరోనా ఎఫెక్ట్ తోలాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాకే పరిమితం అయ్యారు. యాంకర్ రష్మీకి తాజాగా ‘ప్రస్తుతం మీరున్న ఫీల్డ్లో పోటీ బాగా ఉంది కదా! ఆ పోటీని ఎలా ఫేస్ చేస్తున్నారు?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె సమాధానమిస్తూ.. ‘‘పోటీ అనేది ఉంటేనే ఎవరేంటో తెలుస్తుంది. పరిశ్రమలో పోటీ ఉండటం మంచిదే అని నేనంటాను. నేను, అనసూయ ఏ విధంగా ఈ రంగంలో నిలబడ్డామో తెలియంది కాదు. ఇప్పటికీ మేము సుమగారితో పోటీ పడుతూనే ఉంటాము. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను. నేను, అనసూయ బుల్లితెరకు గ్లామర్ను పరిచయం చేశామని, అటువంటి ట్రెండ్ను క్రియేట్ చేశాం అని చెప్పగలను. ఒకరకంగా మా సక్సెస్కి కారణం కూడా అదే…’’ అని రష్మీ చెప్పుకొచ్చింది. రష్మీ ఎప్పుడూ సోషల్ మీడియాలో జాగ్రత్తలు చెబుతూనే ఉంది. నెటిజన్లకు చాలా ఓపికగా అందరికీ తనదైన తరహాలో సమాధానాలు ఇస్తూనే ఉంది. ఇక ఈ సమయంలో మనుషులే కాదు జంతువులు కూడా ఆకలి బాధపడుతున్నాయని… తనే స్వయంగా ఆ జంతువులకు ముఖ్యంగా వీధి కుక్కలకు ఆహారాన్ని అందిస్తుంది.
previous post