telugu navyamedia
సినిమా వార్తలు

ఆ సంత‌కం నాది కాదు..ఫోర్జరీ చేశారు..-రామ్‌ గోపాల్‌ వర్మ

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్‌ వర్మ పోలీస్‌స్టేష‌న్ మెట్లెక్కారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ నట్టి క్రాంతి, నట్టి కరుణలపై ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

‘మా ఇష్టం’సినిమాకు సంబంధించిన లెటర్‌ రేట్‌పై నట్టి ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన క్రాంతి, కరుణలు తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2020 న‌వంబ‌ర్ 30న త‌న లెట‌ర్ హెడ్ తీసుకుని న‌కిలీ ప‌త్రాలు సృష్టించి ఫోర్జ‌రీ సంత‌కంతో వారికి డ‌బ్బులు ఇవ్వాల్సి ఉన్నట్లు సృష్టించార‌న్నారు. ఫోర్జ‌రీ సంత‌కాల‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిజానిజాలు తేల్చాల‌ని కోరారు.

‘ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్(తెలుగులో ‘మా ఇష్టం’) చిత్రాన్ని ఆపడానికి నట్టి క్రాంతి,నట్టి కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నార‌ని పోలీసుల‌కు వ‌ర్మ వివ‌రించారు.

Related posts