telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బ్రేకింగ్ : కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా..

komati-venkat-reddy mp

తెలంగాణలో కరోనా వైరస్ అన్నీ రంగాల వారిని టచ్ చేస్తోంది. వివిధ శాఖల ఉద్యోగులతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వరుసగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్నటి వరకు ఆయన హోం ఐసొలేషన్ లోనే ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయనకు పరీక్షలు నిర్వహించగా… పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తతం ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. తనతో కాంటాక్ట్ ఐన వాళ్ళు కరోనా పరీక్షలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఇవాళ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,456 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో ఐదుగురు కరోనా తో మృతిచెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,27,580 కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనాబారినపడి 2,06,105మంది కోలుకున్నారు. తాజా మరణాలతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1,292 మంది మృతిచెందారు.

Related posts