బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆత్మహత్యగా ద్రువీకరించబడిన ఈ కేసు విచారణలో భాగంగా సుశాంత్తో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరినీ విచారిస్తూ అతని ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలపై కీలక సమాచారం రాబడుతోంది పోలీస్ యంత్రాంగం. ఇటీవలే కేసు దర్యాపును వేగవంతం చేసి సీబీఐకి అప్పగించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. శుక్రవారం రోజు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని 9 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. అయితే సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియాన్ జూన్ నెలలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే దిశ ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల లోపే సుశాంత్ కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో ఇద్దరి మరణాలకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో దిశపై ఆత్మహత్యకు ముందు అత్యాచారం జరిగిందని, ఆమె గర్భవతి అని పుకార్లు వినిపించాయి. అంతే కాకుండా ఆమె ప్రైవేట్ భాగాల్లో గాయాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే ఆరోపణలు చేసారు. కాగా తమ కూతురుపై వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలేనని ఆమె తల్లి వాసంతి సలియాన్ పేర్కొంది. తమ కూతురిపై రేప్ జరగలేదని, ఆమె ఎప్పుడూ గర్భం కూడా దాల్చలేదని, దిశ రిపోర్ట్స్ కూడా క్లియర్ గా ఉన్నాయని తమకు ముంబై పోలీసులపై నమ్మకం ఉందని, తమ కూతురు గురించి తప్పుగా మాట్లాడవద్దని కోరింది వాసంతి.
previous post
అతియా స్విమ్ సూట్ మిర్రర్ సెల్ఫీ పై కేఎల్ రాహుల్ కామెంట్… !