టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. విజయనగరాన్ని చంద్రబాబు విస్మరించాడని తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. వైఎస్ లాగే జగన్ తన హయాంలో ఆ ప్రాంతానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో వీధికో బెల్ట్ షాపు పెట్టించడం.. నదుల్లోని ఇసుక దోచుకోవడం.. గిరిజన ప్రాంతాల్లో ఖనిజాలను కొల్లగొట్టడం, పచ్చని కొండల్లో అగ్గి రాజేయడం తప్ప చంద్రబాబు విజయనగరానికి చేసిందేమీ లేదని విజయసాయి విమర్శనాస్త్రాలు సంధించారు.