మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావేదిక పేరుతో కట్టించిన భవనాన్ని కూల్చివేయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు ఉండవల్లిలోని ప్రజావేదిక హాలులో కలెక్టర్ల సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఈ ప్రజా వేదిక అక్రమ కట్టడమని, దీనికి పర్యావరణ అనుమతులు కానీ, గ్రీన్ ట్రిబ్యూనల్ పర్మిషన్ కానీ, నదుల సంరక్షణ చట్టాలు కానీ ఏవీ పాటించలేదని, 5 కోట్ల బడ్జెట్ తో ప్రారంభించిన ఈ కట్టడాన్ని 9 కోట్లతో పూర్తి చేశారని, దీన్ని బట్టి ఇందులో ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చని జగన్ చెప్పారు. మన పాలనలో పారదర్శకత ఉండాలని, అవినీతి ఉండకూడదని, అందుకే ఈ ప్రజా వేదికలో ఇదే చివరి సమావేశం కావాలని, ఎల్లుండి కల్లా ఈ ప్రజావేదికను కూల్చి వేయాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అత్యంత్య సాహసోపేతమైన నిర్ణయమిది.
previous post
కేంద్ర నిధులను రాబట్టడంలో జగన్ విఫలం: యనమల