కరోనా వైరస్ కారణంగా మెడికల్ ఆక్సిజన్ కొరత ప్రపంచ దేశాలను విపరీతంగా వేధిస్తోందని ఓ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా పేద దేశాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. యూరప్, ఉత్తర అమెరికా వంటి సంపన్న దేశాల్లోని ఆసుపత్రుల్లో నీరు, విద్యుత్ లానే ఆక్సిజన్ కూడా అవసరముంటుంది. ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ను పైపుల ద్వారా నేరుగా ఆసుపత్రిలోని రోగుల బెడ్కు పంపిస్తారు.
పెరు నుంచి బంగ్లాదేశ్ వరకు ఉన్న పేద దేశాల్లో మాత్రం ఆక్సిజన్ కొరత ప్రాణాలను హరిస్తోంది. కాంగోలో అయితే కేవలం రెండు శాతం ఆసుపత్రులలో మాత్రమే ఆక్సిజన్ అందించే సౌకర్యం ఉంది. టాంజానియాలో ఎనిమిది శాతం, బంగ్లాదేశ్లో ఏడు శాతం ఆసుపత్రులలో మాత్రమే ఆక్సిజన్ ఉన్నట్టు ఓ సర్వేలో స్పష్టమైంది.