telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు: రఘురామకృష్ణరాజు

Raghuramakrishnaraju ycp mp

కరోనా విషయంలో వాలంటీర్లు అలసత్వాన్నిప్రదర్శిస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వాలంటీవర్ వ్యవస్థను ప్రపంచ దేశాలన్నీ పొగుడుతున్నాయంటూ మన పార్టీ నేతలు మాత్రమే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. నిజంగా వాలంటీర్లు అద్భుతంగా పని చేస్తే… కరోనా కేసులు ఎందుకు పెరుగుతాయని ప్రశ్నించారు. శ్మశానాల్లో కూడా కరోనా టెస్టులు చేసేంత దారుణ పరిస్థితులు దాపురించాయని చెప్పారు.

తాడేపల్లి కోవిడ్ సెంటర్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని రఘురాజు చెప్పారు. కరోనాను పట్టించుకోకుండా విశాఖకు వెళ్లే అంశంపైనే ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ఏం జరుగుతోందో కూడా తెలుసుకోకుండా ఫ్రాంక్లిన్ సంస్థ ఎందుకు కితాబిచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు.

Related posts