జై, లక్ష్మీరాయ్, కేథరిన్, వరలక్ష్మి శరత్కుమార్ నటించిన తాజా చిత్రం ‘నీయా2’. జెంబో సినిమాస్ పతాకంపై శ్రీధర్ అరుణాచలం నిర్మించిన ఈ చిత్రానికి ఎల్.సురేష్ దర్శకత్వం వహించారు. గత 24వ తేదీ శుక్రవారం ఈ చిత్రం తమిళనాట సుమారు 250 థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రం ముందు రోజు రాత్రి 23వ తేదీన ఇంటర్నెట్లో లీక్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. తమిళనాట మొదటి షోకు ముందే సుమారు లక్షమందికి పైగా ఈ చిత్రాన్ని పైరసీ ద్వారా తిలకించినట్టు తెలుస్తోంది. దీంతో చిత్ర దర్శకుడు, నిర్మాత షాక్కు గురయ్యారు. కొత్త చిత్రాలు ఇంటర్నెట్లో విడుదల కావడం సర్వసాధారణం అయిపోయింది. కానీ “నీయా2” మాత్రం విడుదలకు ముందురోజే లీక్ కావడంతో చిత్రబృందం విస్మయానికి గురయ్యారు.
previous post
next post