telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటకలో అత్యధిక స్ధానాలను గెలుచుకున్నాం: మోదీ

కర్ణాటకలో తాము అత్యధిక స్ధానాలను గెలుచుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాధుని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి భావోద్వేగాలే పనిచేశాయని ప్రధాని పేర్కొన్నారు.

బీజేపీని హిందీ రాష్ట్రాల్లో ప్రాబల్యం కలిగిన పార్టీగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారని మోదీ వ్యాఖ్యానించారు. గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్నామని అయినా తమ పార్టీ హిందీ బెల్ట్‌కే పరిమితమా అని ఆయన ప్రశ్నించారు. అసోం వంటి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ప్రభుత్వాలు లేదా తమ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాలు నడుస్తున్నాయని మోదీ అన్నారు.

Related posts