దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ తప్ప ఆర్ఆర్ఆర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. చాలా రోజుల తర్వాత నయా అప్డేట్ అంటూ సోషల్ మీడియా వేదికగా వచ్చేసింది చిత్ర బృందం. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ‘మన పండగలకు శుభాకాంక్షలు చెబుతూ మేము ప్రకటించే అప్డేట్ల కోసం మీ క్రియేటివిటీని ఉపయోగించి వ్యంగ్యంగా చేస్తున్న పోస్టులు ఇక చాలు. మీ ప్రేమతో మమ్మల్ని చంపుతున్నందుకు ధన్యవాదాలు. కాలం వేగంగా గడిచిపోయింది. చివరకు ఆ క్షణం రానే వచ్చింది. ఇక మిమ్మల్ని అలరించడం మా వంతు. రేపటి వరకు వేచి ఉండండి’ అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రం ట్వీట్ చేసింది. ఇప్పటికే రామ్చరణ్ లుక్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక రేపు కొమర్ భీమ్గా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ను విడుదల చేస్తారా లేదా మరేదైనా కొత్త విషయాన్ని చెబుతారా తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.
ఆడవాళ్లను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ..