ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన బాలీవుడ్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో రణబీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రత్యేకమైన పాత్రలలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర ప్రమోషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది చిత్రబృందం. ప్రగాయ్ రాజ్ 2019 కుంభ మేళాలో కోట్లాది జనసమూహం మధ్య టైటిల్ ను ఆవిష్కరించారు “బ్రహ్మాస్త్ర” టైటిల్ ను ఏకంగా ఆకాశంలో చూపించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు. డ్రోన్ల సహాయంతో సరికొత్త టెక్నాలజీతో ఈ స్పెషల్ ప్రమోషన్ ను నిర్వహించింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Still can’t get over this moment when #Brahmastra lit up the sky.Oh,and we are releasing official movie logo tomorrow. Stay tuned!#Kumbh2019@SrBachchan #RanbirKapoor @iamnagarjuna #AyanMukerji @karanjohar @apoorvamehta18 #NamitMalhotra @FoxStarHindi @DharmaMovies @BrahmastraFilm pic.twitter.com/VHhkCrk4NZ
— Alia Bhatt (@aliaa08) March 5, 2019
ఇక ఇప్పటికే అలియా భట్ సోదరి పూజా భట్ నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సోదరి బాటలో అలియా కూడా నిర్మాతగా మారాలని నిర్ణయించుకుని సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి దానికి “ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్” అనే పేరును పెట్టింది. తాజాగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా చేసింది అలియా. ఈ బ్యానర్ పై మంచి సినిమాలు తీయలనుకుంటున్నట్లు వెల్లడించింది. దీన్ని బలమైన నిర్మాణ సంస్థగా మారుస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది అలియా భట్.