ప్రస్తుతం ఉల్లి ధర 200 రూపాయలకి చేరుకుంది. రానున్న రోజులలో ఇంకెంత పెరుగుతుందో అని జనాలు చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ఇండియన్ టెలివిజన్ నటి హీరా ఖాన్ తన తండ్రితో కలిసి ఉల్లిపాయలకి సంబంధించి ఓ వీడియో చేసింది. దేశంలో ఉల్లిపాయలు పెరుగుతున్న ధరల గురించి మీరు తెలుసుకోవాలి. రోజువారీ వంటగదిలో ఉపయోగించే ఉల్లి ధర ఇప్పుడు కిలో 200 రూపాయలకు చేరుకుంది. కాబట్టి, ఉల్లిపాయలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న ఈ సమయంలో, మా తండ్రి ఉల్లిపాయతో నిండిన బకెట్ని దాచిపెడుతున్నారని చెబుతూ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో నెటిజన్స్ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దేశంలో ఉల్లి రేటు ఎంత ఘాటుగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చికెన్, మటన్ ధరలని మించి ఉల్లి ధరలు పెరుగుతుండడంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఒక వైపు ఉల్లి ధరలు పెరుగుతుండడం వీటిపై జనాలు సెటైరికల్గా వీడియోలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం.