కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే ఆధారమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒక్క తాటిపైకి తీసుకురావడంలో సోనియాగాంధీ విజయవంతమయ్యారని తెలిపారు.
మోదీ తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారన్న రాహుల్ వ్యాఖ్యలకు పవార్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ వెంటనే చేపట్టాలని పవార్ సూచించారు. దేశ వ్యాప్తంగా రాహుల్ పర్యటించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాహుల్ కు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలను అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.