telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు: మంత్రి ఆళ్ల నాని

Alla-Nani minister

కరోనా వైద్యాన్ని నిరాకరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలను తీసుకుంటామని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు ఆళ్ల నాని కరోనాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్యాన్ని నిరాకరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను ఇప్పటికే గుర్తించామని వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్రంలో కొత్తగా 17 వేల మంది వైద్య సిబ్బందిని తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలందరూ సహకరిస్తే కరోనాను సమర్థవంతంగా నియంత్రించగలమని చెప్పారు. కరోనా టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు కన్నబాబు, పినిపే విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా పాల్గొన్నారు. 

Related posts