టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం ఓటమిపాలైంది. సెమీ ఫైనల్లో పీవీ సింధు వరల్డ్ నెం.1 ప్లేయర్ తై జూ చేతిలో ఓడింది. మ్యాచ్ ప్రారంభంలో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు..ఆ తరువాత వెనుకబడింది. దీంతో అనూహ్యంగా పుంజుకున్న తైజు సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ఫైనల్ లోకి ఎంట్రీ ఇవ్వకుండానే సింధు వెనుదిరిగింది.
కాగా..వరుసగా రెండు సెట్లలో ఓడిపోయింది సింధు. ఫస్ట్ సెట్ ను 21-18 తేడాతో నెగ్గింది తై జూ. ఇక, రెండో సెట్ ను 21 – 12 తేడాతో నెగ్గింది తైజూ. అయినా, సింధుకు కాంస్య పతకం నెగ్గే ఛాన్స్ ఉంది. కాంస్య పతక పోరులో సింధు తలపడి.. ఆ మెడల్ ను భారత్ ఖాతాలో వేసే ఛాన్సుంది. ఇక, కాంస్య పతక పోరులో చైనా ప్లేయర్ హి బింగ్ జెయివో తో తలపడనుంది సింధు. ఈ మ్యాచ్ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జరగనుంది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో పీవీ సింధు రజతం గెలిచిన సంగతి తెలిసిందే.
మొదటి సెట్ లో అలవోకగా నెగ్గిన సింధు.. రెండో సెట్ లో ప్రత్యర్థి నుంచి సవాల్ ఎదురైంది. ప్రతి పాయింట్ కోసం పీవీ సింధు- తైజుయింగ్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు జరిగింది. రెండో సెట్ లో గేమ్ పాయింట్ కాచుకుని మ్యాచ్ గెలిచింది పీవీ సింధు. అయితే, కీలక పోరు సెమీస్ లో ఓడిపోవడంతో భారత్ కు తీవ్ర నిరాశ ఎదురైంది.
ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తా: కేసీఆర్