హైదరాబాద్ ఇందిరాభవన్ లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరింగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… మనకు పోడు భూముల హక్కులు కల్పించింది కాంగ్రెస్. దళితులను సీఎం చేస్తానన్న కేసీఆర్ మోసం చేశారు. దళిత, గిరిజనుల హక్కులను తెలంగాణ లో కాలరాస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగింది. హరిత హారం పేరుతో కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకున్నారు. ఎసీ, ఎస్టీ లకు హక్కులు, రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. గిరిజన మంత్రులను, ఎమ్మెల్యేలు లను ప్రశ్నించాలి అని సీతక్క అన్నారు. ఇంద్రవెల్లి వేదికగా జరుగుతున్న ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమ్ముకోవడానికి భూములున్నాయి కానీ దళితులకు, గిరిజనులకు ఇవ్వడానికి భూములు లేవా అని ఎద్దేవా చేశారు. పోడు భూములు రక్షించుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
previous post
next post
టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు: బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు