telugu navyamedia
క్రీడలు వార్తలు

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు

భారత స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు ఒలింపిక్స్‌లో తన విజయ పరంపరను కొనసాగిస్తున్నది. మహిళ సింగిల్స్‌ గ్రూప్‌-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం ఉదయం డెన్మార్క్‌ షెట్లర్‌ మియా బ్లిక్‌ఫెల్ట్‌తో జరిగిన ప్రీక్వార్టర్స్‌లో వరుస గేమ్‌లలో 21-15, 21-13తో ఓడించింది. మొత్తం 40 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి గెలవడానికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. దీంతో వరుస విజయాలతో గ్రూప్‌-జేలో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది.

Related posts