జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ సీనియర్ నేత అద్వానీ తదితరులు నివాళులర్పించారు. జాతిపిత సేవలు, ఆశయాలను దేశ ప్రజలందరూ స్మరించుకుంటున్నారు.
అనంతరం మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ఘాట్లోనూ మోదీతో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు. లాల్బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి, సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితరులు నివాళి అర్పించారు.