ఆర్.పి.ఏ క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత సుదర్శన్ రెడ్డి సారథ్యంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ సినిమా “ప్రేమకథాచిత్రమ్-2”. గతంలో ఇదే బ్యానర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, హార్రర్ కామెడీ సినిమాలకు తెలుగునాట ట్రెండ్ క్రియేట్ చేసిన “ప్రేమకథా చిత్రమ్”కు సీక్వెల్ గా “ప్రేమకథాచిత్రమ్-2” రెడీ అయింది. ఈ చిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయమౌతున్నాడు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తున్నారు. నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ప్రేమకథా చిత్రమ్-2” చిత్రానికి మరో ఆకర్షణ రావు రమేష్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో పాటు యు/ఏ సర్టిఫికెట్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ లభించింది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
next post