లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కోసం తొందరపడటం మంచిది కాదని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సినిమా పరిశ్రమ గురించి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ నుంచి షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై మాట్లాడుకునే అవకాశం ఉంటుందని అన్నారు. నేడు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
చిత్ర పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది బతుకుతున్నారని అన్నారు.లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ చాలా ఇబ్బందులు పడుతోందని, దీని కోసం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే చర్చించామని అన్నారు. చిత్రపరిశ్రమను మరింత అభివృద్ధి చేసే విషయమై ఇప్పటికే చిరంజీవి, నాగార్జునలతో మూడుసార్లు సమావేశమయ్యామని తెలిపారు.