పవన్ కళ్యాణ్ని విమర్శించే వారికి వార్నింగ్ ఇచ్చింది ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి. ఓ మీడియాతో ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా.. పవన్ కళ్యాణ్ వెంట తామున్నామని, ఆయనను విమర్శిస్తూ ఎవ్వరైనా పవన్ జోలికొస్తే తాట తీస్తామని చెప్పింది. కొందరు తమ పేరును పాపులర్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తున్నారని, అలాంటి కుక్కలకు సమాధానం చెబుతామని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది తమన్నా. రాకేష్ మాస్టర్, శ్రీరెడ్డి లాంటి వారితో పాటు ఇంకొందరు తమ పాపులారిటీ కోసమే విమర్శలు చేస్తున్నారని ఆమె పేర్కొంది. పవన్ ను తిట్టి వార్తల్లో నిలవాలని, అలా తమ పేరు ప్రజల నోళ్ళలో నానాలని కొన్ని పిచ్చికుక్కలు ప్రయత్నిస్తున్నాయని తమన్నా ఫైర్ అయింది. ఎవడో తిట్టాడని, వాళ్లందరికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అలాంటి వారిని చెప్పుతో కొట్టేందుకు మేమున్నాం అంటూ రెచ్చిపోయింది తమన్నా. శ్రీ రెడ్డి మహిళ కాబట్టి వదిలేశామని, ఈ లాక్డౌన్ పూర్తికాగానే పవన్ని విమర్శించే వాళ్లను చెప్పుతో కొడతాం అనేసింది తమన్నా. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పవన్ చాలా శ్రమిస్తున్నారని ఆమె చెప్పింది. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ సొంత డబ్బుతో పార్టీని నడుపుతున్నారని చెప్పుకొచ్చింది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తుందని అనుకున్నా, కానీ రాకపోవడంతో ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్గా పోటీ చేశానని తెలిపింది తమన్నా సింహాద్రి.
అభాండాలు వేసి, బూతులు తిట్టారు : శేఖర్ మాస్టర్