telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

రిషీ క‌పూర్ మ‌ర‌ణం బాలీవుడ్‌కు తీర‌ని లోటు: కేంద్ర మంత్రి జ‌వ‌దేక‌ర్

praksh javadekar

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్తతో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది. రిషి కపూర్ హ‌ఠాన్మ‌ర‌ణం త‌న‌ను దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని కేంద్ర స‌మాచార ప్రసార శాఖ‌ల మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ చెప్పారు.

రిషీ క‌పూర్ గొప్ప న‌టుడు మాత్ర‌మే కాద‌ని, చాలా మంచి మ‌నిషి కూడా అని ఆయ‌న‌ పేర్కొన్నారు. రిషీ క‌పూర్ మ‌ర‌ణం బాలీవుడ్‌కు తీర‌ని లోటని అభిప్రాయ‌ప‌డ్డారు. రిషిక‌పూర్ కుటుంబ‌స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు, అభిమానుల‌కు తాను మ‌న‌సారా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాని జ‌వ‌దేక‌ర్ పేర్కొన్నారు.

Related posts