telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జమ్మూకాశ్మీర్ లో… ఇంకా ఆగని ఉగ్రవాదుల దాష్టికాలు..

another terrorist attack in j & k

మరోమారు ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ లో తెగబడ్డారు. పుల్వామా జిల్లాలోని నౌదల్ వద్ద సీఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డట్టు సమాచారం. సీఆర్పీఎఫ్ శిబిరంలోని 180వ బెటాలియన్ ఉన్న చోట ఈ దాడి జరిగినట్టు అధికారుల సమాచారం.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు రెండు నెలల క్రితం ఇదే జిల్లాలో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నలభై మందికి పైగా జవాన్లు మృతి చెందారు.

Related posts