telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వాహనదారులపై పిడుగు : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

petrol bunk

ఇండియాలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.97.22 కాగా.. డీజిల్‌ రూ. 87.97 కు చేరింది. అటు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.33 కాగా, డీజిల్ ధర రూ.96.17 చేరింది. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.70 కాగా.. డీజిల్‌ రూ. 97.94 కు చేరింది. అలాగే గుంటూరులో లీటర్‌ ప్రీమియం పెట్రలో ధర రూ. 107.15 కు చేరుకుంది. అటు చమురు ధరలు పెరగడం పట్ల వాహనదారులు, విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Related posts