telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇప్పుడు తెలివిలోకి వచ్చాడు.. పవన్ పై విజయసాయి విమర్శలు

Vijayasai reddy ycp

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. ఇప్పుడు తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని పవన్ ఒప్పుకున్నాడని ట్విటర్ లో పేర్కొన్నారు.

ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మించిపోయాడన్న విధంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. యూ-టర్నుల్లో చంద్రబాబును మించి పోయాడని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Related posts