మలయాళ స్టార్ హీరోయిన్ మంజూ వారియర్, దర్శకుడు శ్రీకుమార్ కు మధ్య వార్ నడుస్తోంది ఇప్పుడు. ఇటీవల మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన “ఒడియన్” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మంజూ వారియర్ కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు శ్రీకుమార్ మీనన్ తనను అసభ్యంగా దూషించాడని, తనను, తన స్నేహితురాళ్లను ఎంతో మానసిక వేదనకు గురిచేశాడని ఆ సినిమాలో కథానాయికగా నటించిన మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమ నుంచి వెళ్లగొడతానని, చంపేస్తానని శ్రీకుమార్ బెదిరించాడని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలకు స్పందనగా శ్రీ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మంజు.. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నేను మాత్రమే నీకు అండగా ఉండి సహాయం చేశాను. నువ్వు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావడం లేదు. నువ్వు నా మీద కేసు పెట్టిన విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నాను. విచారణ సమయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను. నాకు, నీకు మాత్రమే తెలిసిన ఎన్నో విషయాలను బయటపెడతాను” అని ఆయన పేర్కొన్నారు.
previous post
next post