కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, ‘ది వారియర్’ మూవీ డైరెక్టర్ లింగుస్వామికి కోర్టు షాక్ ఇచ్చింది. చెక్బౌన్స్ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పునిచ్చింది.
తమిళ్ స్టార్ హీరో కార్తీ, సమంత జంటగా నటించిన యెన్ని ఏడు నాలుకుల్లా చిత్రాన్ని తెరకెక్కించేందుకు డైరెక్టర్ లింగుస్వామి పీవీపీ ప్రొడక్షన్ కంపెనీ నుంచి కొన్నే్ళ్ల క్రితం డబ్బులు అప్పుగా తీసుకున్నారు. అయితే సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న సొమ్మును చెక్ రూపంలో తిరిగి చెల్లించారు..దాదాపు రూ. 1.03 కోట్ల విలువైన చెక్ బౌన్స్ అయినట్లుగా తెలుస్తోంది.
కానీ ఆ చెక్బౌన్స్ అవ్వడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన కోర్టు.. డైరెక్టర్ లింగుస్వామితోపాటు..అతని సోదరుడు సుభాష్ చంద్రకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
అంతేకాకుండా తీసుకున్న డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో లింగుస్వామి పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్లో హాట్టాపిక్గా నిలిచింది.