రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ స్టార్ అక్షయ్కుమార్, ఎమీజాక్సన్ కాంబినేషన్లో రూపొందిన విజువల్ వండర్ “2.0”. ఈ సినిమా గత ఏడాది చివర్లో ఇండియాలో హిందీ, తమిళ, తెలుగు భాషల్లో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న తమిళ్ సినిమాగా “2.0” నిలిచినప్పటికీ పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయింది. అయితే సినిమాను చైనాలో భారీగా రిలీజ్ చెయ్యాలని చైనీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ హెచ్.వై మీడియా సన్నాహాలు చేసింది. ఈ సినిమాను జూలై 12న చైనాలో విడుదల చేయాలని అనుకున్నారు. పలు బాలీవుడ్ సినిమాలను చైనాలో భారీ రేంజ్లో విడుదల చేసింది హెచ్ వై మీడియా. అయితే “2.0”ను భారీ ఖర్చుతో విడుదల చేసిన తర్వాత మరో భారీ సినిమాను నిర్మాణ సంస్థలు విడుదల చేయాలంటే రెండు వారాలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అయితే జూలై 19న “ద లయన్ కింగ్” విడుదలవుతుంది. ఈ సినిమా గురించి చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఈ పోటీ మధ్య “2.0”ను విడుదల చేస్తే నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి “2.0”ను విడుదల చేయకుండా వెనక్కి తగ్గారని తెలుస్తోంది.
previous post