యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్కి కోపం కట్టలు తెంచుకుంది. థియేటర్లో ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమాకి మొదటి షో నుండే నెగెటివ్ టాక్ రావడంతో ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సినిమా బాగోలేదనే కోపంతో భీమవరంలోని ఓ థియేటర్లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కుర్చీలన్నీ విరగ్గొడుతున్న ఓ వీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది. సినిమా రిలీజ్కి ముందు భీమవరంలో ప్రభాస్ ఫ్యాన్స్ భారీ కటౌట్ ఏర్పాటు చేయగా, ఇది ప్రతి ఒక్కరి దృష్టిని ఎంతో ఆకర్షించింది. కటౌట్స్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అని చెప్పుకొచ్చారు. బాహుబలి లాంటి భారీ హిట్ సినిమా తర్వాత ప్రభాస్ ఇలాంటి సినిమా చేయడం అభిమానులకి అస్సలు నచ్చడం లేదు.
కింద పడి మరీ నవ్వుకున్నా… “మన్మథుడు-2″పై అమల కామెంట్స్