టాలీవుడ్ కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం “మన్మథుడు-2”. భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమాపై ఉన్న హైప్, ఆల్రెడీ మన్మథుడు లాంటి క్లాసిక్ మూవీ టైటిల్తో వస్తోన్న సినిమా కావడంతో పాటు నాగ్ ఫ్యామిలీ చేసిన ప్రమోషన్లతో సినిమా సూపర్ హిట్ అవుతుందనే అందరూ అనుకున్నారు. ఈ సినిమాకు ఏకంగా రూ.24 కోట్ల వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. కానీ ఫస్ట్ షోకే ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ సినిమా మీద హైప్ ఉండడంతో ఓపెనింగ్స్ అయితే బాగానే రాబట్టింది. “మన్మథుడు-2” సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజున రూ.5.03 కోట్ల షేర్ సాధించిందని చిత్ర బృందం తెలిపింది. సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.3.86 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నారు. వారాంతంలో ఇంకా వసూళ్లు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. లక్ష్మి, ఝాన్సి, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సమంత, కీర్తి సురేశ్ అతిథి పాత్రల్లో కనిపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. “మన్మథుడు-2” సినిమా చూసి తెగ నవ్వుకున్నానని అక్కినేని అమల తెలిపారు. ఆమె భర్త, ‘కింగ్’ నాగార్జున నటించిన ఈ సినిమాను చూసిన ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. సినిమా చక్కగా ఉందని అభిప్రాయపడ్డారు. “సీటు నుంచి జారి కిందపడేలా నవ్వుకున్నా. సినిమా నాకు ఎంతో నచ్చింది. ఇది పూర్తిగా న్యూఏజ్ చిత్రం. అద్భుతంగా ఉంది” అని పేర్కొన్నారు.
previous post
సెట్లో ఆడవారితో బాలకృష్ణ తీరు ఇదే… బాలకృష్ణ అభిమానికి “నో” చెప్పిన పాకీజా