ఏపీలోని విజయవాడ నగరంలో దారుణం జరిగింది. కుటుంభ కలహాలతో నడిరోడ్డుపై ఓ భర్త తన భార్యను నరికి చంపాడు. సత్యానారాయణపురం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గత నాలుగేళ్ల క్రితం ప్రదీప్, మణిక్రాంతి ప్రదీప్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రదీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా మణిక్రాంతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో విచారణలో ఉంది. విడాకుల కేసు కూడా చివరిదశకు చేరుకుంది. భర్తతో విడిపోయిన మణిక్రాంతి తల్లి దగ్గర నివాసముంటుంది. గతంలో ప్రదీప్పై మణికాంత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బెయిల్పై ప్రదీప్ నిన్ననే బయటకు వచ్చాడు. ఇదే సమయంలో తన భార్యను ప్రదీప్ అత్యంత కిరాతకంగా హత్యచేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.