“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా విడుదలైన “సాహో” ట్రైలర్ సినిమా పై అంచనాలని భారీగా పెంచేసింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్, శ్రద్ధా కపూర్ల రొమాన్స్తో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ని షేక్ చేయబోతున్నట్టు తాజాగా విడుదలైన ట్రైలర్ని చూస్తే అర్థమవుతోంది. టేకింగ్, ప్రభాస్ నటన, యాక్షన్ పార్ట్, హై టెక్నికల్ వేల్యూస్ అద్భుతంగా ఉన్నాయంటూ అందరూ ట్రైలర్ని ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఈ ట్రైలర్పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ట్రైలర్ ఇప్పుడు రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన ముంబయి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ మహిళా విలేకరి ప్రభాస్ను ప్రశ్నిస్తూ.. ‘సర్.. మీకున్న క్రేజ్తో బాలీవుడ్ ఖాన్త్రయానికి (ఆమిర్, సల్మాన్, షారుక్)గట్టి పోటీనిస్తారా?’ అని ప్రశ్నించారు. ఇందుకు ప్రభాస్ స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు మేడమ్. ఇక నేను బయలుదేరనా?’ అని చమత్కరించారు. అనంతరం.. ‘మీ ముంబయి ఫ్యాన్స్ కోసం హిందీలో మాట్లాడండి’ అని సదరు విలేకరి ప్రభాస్ను కోరారు. ఇందుకు ప్రభాస్.. ‘జై హింద్’ అని చెప్పారు. తనకు హిందీ చదవడం, రాయడం వచ్చు కానీ మాట్లాడటం రాదని ప్రభాస్ ఈ సందర్భంగా చెప్పారు. అందుకే ‘సాహో’ సినిమాలో హిందీ వెర్షన్కు సంబంధించిన డైలాగులు పలకడంలో తడబడ్డానని తెలిపారు. తన పాత్ర వరకు డబ్బింగ్ చెప్పించారని పేర్కొన్నారు. ‘సాహో’ సినిమా ఉత్తర భారత్లో దాదాపు 4,500 తెరలపై విడుదల కానుంది. ఆగస్ట్ 30న ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్టార్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు