telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్…

Poonam-Pandey

పూనమ్ పాండే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే కరోనా టైమ్‌లో ఇటీవల పలువురికి నిత్యావసరాలు అందజేసి తన పెద్ద మనసు చాటుకున్న పూనమ్ ​పాండేను మీడియా పలకిరించింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ​ ఫైనల్ గురించి ఆమె ముందు ప్రస్తావించింది. దీంతో ‘క్రికెట్ జరుగుతుందా? భారత్ గెలిస్తే మళ్లీ నేను బట్టలు లేకుండా​ కనిపిస్తానని మీకు చెప్పాలా?. దీని గురించి నాకేం తెలియదు. ఇంటికెళ్లి ఈ వివాదం గురించి ఆలోచిస్తాలే’అని పూనమ్ తనదైన శైలిలో బదులిచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అయితే 2011 వన్డేప్రపంచకప్​ సందర్భంగా ఇలానే షాకింగ్ వ్యాఖ్యలు చేసిన పూనమ్ పాండే.. ధోనీసేన విజేతగా నిలిస్తే న్యూడ్​గా కనిపిస్తానని చెప్పింది. పైగా ఇది పెద్ద నేరం ఏం కాదని దేశం కోసమేనని చెప్పుకొచ్చింది. (నేనేం నేరం చేయడం లేదు. నాకు క్రికెట్ అంటే పిచ్చి. దేశం కోసం న్యూడ్‌గా ఫోజులిస్తానంటున్నా. దేశం మొత్తం క్రికెట్‌ను ఇష్టపడుతుంది. ప్రతీ ఒక్కరు క్రికెట్‌ను ఆరాధిస్తారు. ఇప్పటికే నేను చాలా షూట్స్‌లో న్యూడ్‌గా నటించా. దేశం కోసం ఇలా చేయడం కరెక్టే అనిపించింది. నేనెవరికి భయపడటం లేదు’అని పేర్కొంది. అప్పట్లో అది పెద్ద చర్చనీయాంశమైంది.

Related posts