telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆలయాలు, దేవుళ్ళు తప్ప ప్రజా సమస్యలు బండి సంజయ్ కి గుర్తుకురావా…

jaggareddy in pcc race in telangana

ఆలయాలు, దేవుళ్ళు తప్ప పేదల ఇబ్బందులు బండి సంజయ్ కి గుర్తుకురావా అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. యూపీఏ ప్రభుత్వం లో క్రూడాయిల్, సిలిండర్ ల పై పది పైసలు పెంచితే బీజేపీ నానా యాగిరి చేసేది..మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. ఇప్పటి కేంద్ర మంత్రి స్పృతి ఇరానీ సిలిండర్ రోడ్డు పై పెట్టుకోని నిరసన చేసింది మర్చిపోయారా…దీనికి బండి సంజయ్ ఏం సమాధానం చెప్తారన్నారు. ప్రజా సమస్యల పై మాట్లాడకుండా యువతను రెచ్చగొట్టే వాఖ్యలు బండి సంజయ్ చేస్తున్నారని.. బీజేపీ కేంద్రం లో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీ లు బండి సంజయ్ గు గుర్తున్నాయా అని ప్రశ్నించారు. పేదల అకౌంట్ లలో వేస్తామన్న 15లక్షల ఏమయ్యాయి..కనీసం తెలంగాణ లోని పేదలకైనా 15లక్షలు వచ్చాయా..రాకుంటే ప్రధాని తో మాట్లాడి బండి సంజయ్ ఇప్పించగలరా..అని ఎద్దేవా చేశారు. దీనికి ఎందుకు బండి సంజయ్ సమాధానం చెప్పట్లేదని.. యూపిఏ ప్రభుత్వం లో 40రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ఇప్పుడు డబ్బులు అయింది..మరి బండి సంజయ్ ప్రధాని తో మాట్లాడి ధర తగ్గిస్తారా.. అని నిలదీశారు. యూపీఏ ప్రభుత్వం లో లీటర్ డిజిల్ 36రూపాయలు ఉంటె ఇప్పుడు 78రూపాయలు అయింది.. ఇది ప్రజలకు ఏంత పెద్ద భారమో బీజేపీ ప్రభుత్వం తెలుస్తుందా..అని ప్రశ్నించారు. కాళీకామాతా భూముల గొడవ ముఖ్యమా…. క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల ప్రజల ఇబ్బందులు ముఖ్యమా..అని ఫైర్‌ అయ్యారు.

Related posts