telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో నాలుగో జేసీ పోస్టును మంజూరు చేసింది ప్రభుత్వం. జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో మరో జేసీ పోస్టుని ఏర్పాటు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాల్లో ముగ్గురు జేసీల ఏర్పాటు చేసిన సర్కార్.. జేసీ-హౌసింగ్ పోస్టును ఐఏఎస్ కేడర్ అధికారితో భర్తీ చేయాలని ఆదేశించింది. జేసీ-హౌసింగ్ పరిధిలో ఇంధన, గ్రామీణ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, ఏపీ ఫైబర్ నెట్, విలేజ్ వార్డు సెక్రటేరీయేట్ శాఖలు ఉండనున్నాయి. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండడంతో జేసీ-హౌసింగ్ పోస్టు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక ఇళ్ల నిర్మాణం కోసం మొదటి, రెండో విడతల్లో మొత్తంగా రూ. 50,944 కోట్ల మేర ఖర్చు చేయనుంది జగన్ సర్కార్. మొదటి విడతలో రూ. 22,084 కోట్లతో జూన్ 2022 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సర్కార్…రెండో దశలో 22,860 కోట్లతో జూన్ 2023 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇళ్ల నిర్మాణంతో పాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌళిక సదుపాయాల పూర్తి చేయాలని ఆదేశించింది.

Related posts