telugu navyamedia
రాజకీయ

గూలాబీ గూటికి పెద్దిరెడ్డి- ద‌ళిత బంధు ఆగ‌దు..

ద‌ళిత బంధు ఆగ‌దు..
గూలాబీ గూటికి చేరిన‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీలోలో చేరారు.

‘‘పెద్దిరెడ్డి నాకు సన్నిహిత మిత్రులని, రాష్ట్రాభివృద్ధిలో చేదోడు వాదోడుగా ఉంటార‌ని,. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి.. పేదలకు ఇస్తున్న పధకాలు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయంటూ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. చేనేత కార్మికులకు రైతు బీమా తరహా సౌకర్యం కల్పిస్తాం. ఎస్సీ సంక్షేమ శాఖలోనూ రైతు బీమా తరహా ఏర్పాట్లు చేయాలి.

ఎన్నో అటు పోట్లు, ఇబ్బందులు దాటి అనేక విషయాల్లో ఈరోజు దేశంలోనే నంబర్‌ వన్ గా తెలంగాణ ఉంద‌ని, జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కాశ్మీరఖండమే అవుతుంది.

అంతేకాగా..ద‌ళిత బంధు మ‌హాయ‌జ్ఞం అని, ఆరునూరైనా ద‌ళిత బంధు ఆగ‌ద‌ని, ఎవ‌రు ఆపుతారో తాను చూస్తాన‌ని స‌వాల్ విసిరారు. ఒక్క‌సారి కేసీఆర్ చెప్పాడంటే అది జ‌రిగితుంద‌న్నారు. ర‌దళితబంధును చూసి విపక్షాలు అదిరిపడుతున్నాయి. దళతబంధు ఆగదు.. ఎవరూ ఆపలేరు.. దశలవారీగా వందశాతం అమలు చేసి తీరుతాం. దళిత బంధు కోసం లక్ష కోట్లయినా ఖర్చు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

Related posts