telugu navyamedia
రాజకీయ వార్తలు

గుజరాత్‌లో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

bijesh mirja congress

రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గుజరాత్‌లో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బుధవారం అక్షయ్ పటేల్, జీతూ చౌధరిలు రాజీనామా చేయగా, నిన్న మోర్బీ ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా తన ఎమ్మెల్యే పదవితోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

బ్రిజేష్ రాజీనామాను స్పీకర్ రాజేంద్ర త్రివేది ఆమోదించారు. కాగా, మార్చిలో ఒకసారి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజా రాజీనామాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం 60కి పడిపోయింది. ఈ నెల 19న రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలకు ప్రాధాన్యం ఏర్పడింది. గుజరాత్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇద్దరిని బరిలోకి దింపంగా, బీజేపీ నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు.

Related posts