telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంలో కొట్టివేత!

Supreme Court

పంచాయతీ భవననాలకు పార్టీ రంగులపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెంటనే రంగులను తొలగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయ రంగు వేస్తే మీరు ఊరుకుంటారా? అని ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది

కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని హైకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ రంగులను తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related posts