telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అందుకే ఎన్నికలను బహిష్కరించాం…

ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇప్పటికే ఎస్ఈ సి రిలీజ్ చేసింది. కానీ ఏప్రిల్ 8 న జరిగే ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే.  ఎన్నికల బహిష్కరణపై ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే ఎన్నికలను బహిష్కరించినట్టు తెలిపారు.  దేశం మొత్తం ఏపీ వైపు చూడాలని ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు అయన తెలిపారు.  పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ ఎలాంటి హింసకు పాల్పడిందో చూశామని, ఎన్నికలకు ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తారో ఎస్ఈసి, డీజీపీ చెప్పాలని పయ్యావుల డిమాండ్ చేశారు.  ఒక్కవిడతలో ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అన్నారు.  కోర్టు విచారణలో ఉండగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అని అయన ప్రశ్నించారు. అయితే ఈ ఎన్నికల పై అక్కడ పెద్ద రగడ నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఏపీలో పార్టీలు అన్ని తిరుపతి ఉప ఎన్నికల పైన దృష్టి సారించాయి. చూడ;లి మరి ఎక్కడ ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts