*బొజ్జల మృతిపై చంద్రబాబు సంతాపం..
*బొజ్జల మరణం అత్యంత బాధాకరం..
*బొజ్జల మరణం టీడీపీకి తీరని లోటు..
మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి అత్యంత బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గోపాలకృష్ణారెడ్డి లాయర్గా జీవితాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
బొజ్జల లాంటి రాజకీయ నేతలు.. నేటి తరానికి చాలా అసవరం అన్నారు. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చిన సక్రమంగా నిర్వహిస్తూ.. గర్వకారణంగా నిలిచారని.. ఆయనతో పని చేసిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
ఇటీవలే బొజ్జల పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయన నివాసంలోనే చంద్రబాబు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపించారు. టీడీపీ పేరు మీద రూపొందించిన కేక్ను బొజ్జలకు చంద్రబాబు స్వయంగా తినిపించారు. చంద్రబాబు రాకను చూసి.. చాలా ఉప్పొంగిపోయారు బొజ్జల.. ఆయన చివరి ఆనంద క్షణాలు అవే అంటున్నారు కుటుంబ సభ్యులు.
ఆ సీఐకి అన్నీ తెలుసు..వివేకా కూతురు