telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి బీజేపీ ఫిర్యాదు

BJPpresident -K-Laxman

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు ఇంటర్‌ విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణాలపై విచారణ జరిపించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్‌ విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చాలా బాధపడ్డారని తెలిపారు.విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యార్థుల ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపించాలన్న తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారన్నారు.

ఇంటర్‌ విద్యార్థులవి ఆత్మహత్యలు కావని, అవి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు.రాష్ట్రంలో 27 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం వారి కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోకుండా మళ్లీ ఆ సంస్థకే రీ వెరిఫికేషన్‌ ప్రాజెక్టు ఇవ్వడం దుర్మార్గమైన చర్యని దుయ్యబట్టారు.

Related posts