రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంపై టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగం చాలా పేలవంగా ఉందన్నారు. బీజేపీని పొగడటానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగంలో విభజన చట్టంలోని అంశాలు, దేశంలో నిరుద్యోగ సమస్య, రైతు సమస్యల గురించిన ప్రస్తావనే లేదని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతితో అసత్యాలు పలికించారని అన్నారు. 2014 కంటే ముందు ప్రభుత్వాలు అస్థిరమైన ప్రభుత్వాలని రామ్ నాథ్ తో అనిపించడం బాధాకరమని అన్నారు. యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు కచ్చితంగా స్థిరమైనవన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఉత్తమ్ పేర్కొన్నారు.