రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గత టీడీపీ హయాంలో ఉన్న 4, 5 విడతల బకాయిలను నిలిపివేసింది. రూ. 7,959 కోట్ల చెల్లింపులను ఆపేసింది.
ఈ ఏడాది మార్చి 10న టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38ని రద్దు చేసింది. 4, 5 విడతల మొత్తంతో పాటు 10 శాతం వడ్డీని కలిపి గత ప్రభుత్వం జీవో 38 విడుదల చేసింది. గత ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తాజాగా జీవో 99ని విడుదల చేసింది. వైయస్ఆర్ రైతు భరోసా పథకం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.