telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గుంటూరుకు ఏపీసీఎం .. వన మహోత్సవానికి హాజరు..

ys jagan cm

రేపు ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో జరిగే 70వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్‌ స్వయంగా మొక్కలు నాటనున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ఆయన ప్రారంభించనున్నారు.

అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు, పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు.

Related posts